సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదు : కేసీఆర్

-

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేవిధంగా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరీని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు ఎంతకాడికైనా పోరాడుతామని కేసీఆర్ తేల్చి చెప్పారు.

ఫిబ్రవరి 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు కేసీఆర్. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కి పోరాటం కొత్త కాదన్నారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్లినట్టయితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు తెలివి లేదని ఎద్దేవా చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version