నేడు వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రూ. 721 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందిరమ్మ మహిళా శక్తితో పాటు పలు పథకాలనున ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లోన్ మేళా ద్వారా లబ్దిదారులకు చెక్కుల పంపిణీ ఉంటుంది. జాబ్ మేళా ద్వారా నియామక పత్రముల అందించనున్నారు.
12 గంటలకు స్థానిక ZPHS పాఠశాల .. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు. పార్టీ ముఖ్యులు, తన చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మధ్యాహ్నం 2.15 గంటలకు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారు. మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ తో పాటు అక్కడ ఏర్పాటుచేసిన రుణ మేళా, ఉద్యోగ మేళా లో పాల్గొంటారు. సాయంత్రం 4.15 కు వనపర్తి నుంచి SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.