పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై కమిటీ

-

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్ల వేధింపులు తట్టుకోలేక హానికారక ఇంజక్షన్ తీసుకున్న వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై కమిటీ ఏర్పాటైంది. నలుగురు ప్రొఫెసర్లతో ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్లు ఈ కేసు వివరాలు పరిశీలించిన తర్వాత అందించే రిపోర్టును సీల్డ్ కవర్​లో డీఎంఈకి ఇవ్వనున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు.

మరోవైపు వైద్యవిద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై డీఎంఈ రమేశ్ రెడ్డి స్పందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. కేఎంసీలో ర్యాగింగ్ జరగలేదని స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య ఉన్నవి మనస్పర్థలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. జూనియర్లతో సీనియర్లు ఏవిధంగా చెబుతారో ఇక్కడా అదే జరిగిందని అన్నారు. కాకపోతే ఈ విద్యార్థిని విషయంలో కొంచెం ఇబ్బందికరంగా జరిగినట్లుందని చెప్పారు. ఈ ఘటనపై ఘటనపై కమిటీ వేశామన్న రమేశ్ రెడ్డి.. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version