TV9 జర్నలిస్ట్‌ని చంపేస్తానంటూ కాంగ్రెస్ నేత బెదిరింపులు ?

-

జర్నలిస్ట్‌ని చంపేస్తానంటూ కాంగ్రెస్ నేత  బెదిరింపులకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. అదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి మీద వార్త రాసినందుకు టీవీ9 జర్నలిస్ట్‌ని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తన ఆవేదనను ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు టీవీ9 జర్నలిస్ట్.

టీవీ9 జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్ ప్రకారం..  ఓ ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత మీద వార్త రాసినందుకు చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. అనుచరులతో ఇంటి మీదకు జనాలను పంపించారు…. నేను ఇంటి దగ్గర లేను. ఇదేనా పద్దతి.. 12 ఏళ్ల నా జర్నలిజంలో ఏ రోజు ఎవరికి తలొంచలే.. ఎవడికి చెంచాగా పని చేయలే నిబద్దతో పని చేశానని సదరు జర్నలిస్ట్ పేర్కొన్నారు.

నిక్కచ్చిగా వార్తలిస్తే చంపేస్తారా..? అయితే అదే చేయండి. బెదిరిస్తారా.. ఇక్కడ బెదిరింపులకు తలొగ్గేదే లేదు. 12 ఏళ్లలో ఎన్నో చూశా.. ఎన్నో సవాల్లను ఎదుర్కున్నా.. ఫేస్ బుక్ , వాట్సాప్ లను హ్యాక్ చేసేందుకు కూడా బల్క్ మెసేజ్ లు పంపుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి. ఫేస్ బుక్ టార్గెట్ ఇష్టారీతిన మెసేజ్ లు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నా నిజాయితీ ఏంటో నా 12 ఏళ్ల జర్నలిజం చెప్తది. ఎవడికి మోకరిల్లే ప్రసక్తే లేదు. నిందలేస్తే తలొంచుకునే సవాలే లేదన్నారు సదరు జర్నలిస్ట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version