Telangana : ఇంటర్‌ ఫలితాల్లో కూలీ బిడ్డకు 993 మార్కులు

-

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం రోజున విడుదలైన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఫలితాల్లో మారుమూల గిరిజన బిడ్డ రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన బాణోతు అంజలి మంచి మార్కులు తెచ్చుకుంది. మొత్తం ఇంటర్ ఈ విద్యార్థిని 993 మార్కులు సాధించింది.

తండ్రి నర్సింహారావు, తల్లి జ్యోతి రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు వెళ్తుంటారు. అంజలికి స్వగ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకుంది. జ్యోతిరావు ఫులే వెనకబడిన తరగతులు గురుకుల విద్యాలయం ప్రవేశ పరీక్ష రాసి భద్రాచలంలో విద్యాలయంలో సీటు రావటంతో ఆరో తరగతి నుంచి  పదోతరగతి వరకు అక్కడే చదువుకుంది. ప్రతిభ కలిగిన విద్యార్థుల జాబితాలో ఖమ్మంలోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ప్రవేశం లభించగా.. రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించాలని లక్ష్యం పెట్టుకున్న అంజలి ప్రథమ సంవత్సరంలో 466 మార్కులు.. ద్వితీయ సంవత్సరంలో మరింత పట్టుదలతో చదివి 993 మార్కులు సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version