ఊపిరి ఉన్నంత వరకు BJPలోనే కొనసాగుతా – డీకే అరుణ

-

ఊపిరి ఉన్నంత వరకు BJPలోనే కొనసాగుతానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రకటన చేశారు. పార్టీ మార్పు ప్రచారం పై స్పందించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ..కీలక వ్యాఖ్యలు చేశారు. ఊపిరి ఉన్నంత వరకు బిజెపి లోనే కొనసాగుతానని.. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని వార్త పత్రికలు, మీడియా చానళ్లు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని ఫైర్‌ అయ్యారు.

బిజెపి నుంచి వలసలు ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని ప్రసార మాధ్యమాలకు బాధ్యతలు అప్పగించినట్లు అనుమానం వస్తుందని ఆగ్రహించారు. తన నియోజకవర్గంలో బిజెపి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తాను ప్రచారంలో పాల్గొంటున్నానని వెల్లడించారు. ఈ విషయం ఆ పత్రికలు, ఛానళ్లకు కనిపించడం లేదా అని నిలదీశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయం పై మరోసారి మీడియా తమ ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తే న్యాయ విచారణకు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version