మెజార్టీ లేకున్నా బీజేపీకి అధికారం.. కాంగ్రెస్సే కారణం : మమత బెనర్జీ

-

గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అధికారం రావడానికి కాంగ్రెస్  కారణమంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన సందర్బంగా బంగ్లార్ నిర్బచోస్ ఒ అమ్రా పేరుతో తాను రాసిన మూడు పుస్తకాలను ఆమె విడుదల చేసారు. ఆ పుస్తకంలో 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాల పై లోతైన విశ్లేషణ చేశారు.

బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ కారణం అని దీదీ పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ఓటమి లక్స్యంగా ప్రతిపక్షాలన్నీ ఓ కూటమిగా ఏర్పడ్డాయి. అన్ని కార్యక్రమాలను ఉమ్మడిగా ముందుకు తీసుకెళ్లాయి. కానీ నాయకత్వం కోసం కూటమిలోని అభ్యర్థులు పరస్పరం పోటీకి దిగారు. తృణమూల్ కాంగ్రెస్ శాయాశక్తుల్లా కృషి చేసినప్పటికీ గెలుపు దక్కకుండా పోయింది. మెజారిటీ రాకపోయినా బీజేపీకి అధికారం దక్కిందని ఆమె పుస్తకంలో పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version