ఎంపీ ఎన్నికల్లో అడ్రస్ లేని హైద్రాబాద్ మాజీ మేయర్ !

-

ఎంపీ ఎన్నికల్లో హైద్రాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎక్కడా కనిపించడం లేదు. బీఆర్ఎస్ లో అవకాశం రావడం లేదని కాంగ్రెస్ లోకి వెళ్లి భంగపడ్డ మాజీ మేయర్ కు బొంతు రామ్మోహన్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ ఆశించగా పార్టీ అధిష్టానం హ్యాండ్ ఇవ్వడంతో అసంతృప్తిలో బొంతు ఉన్నారు. మొహమాటానికి సతీమణి బొంతు శ్రీదేవిని మాత్రమే ప్రచారంలో ఉంచారు రామ్మోహన్.

bonthu rammohan

ఇక బొంతు మౌనం పై అయన క్యాడర్ లో ఆందోళన చెందుతున్నారు. నాయకుడు సడి సప్పుడు లేకుండా ఉండటంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు బొంతు రామ్మోహన్ అనుచరులు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రాజకీయ భవిష్యత్ ప్రమాదం లో పడే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఎదో ఆశించి కాంగ్రెస్ లోకి వెళ్తే ఎదో జరిగి ఎటూ కాకుండా అయింది అని అనుచరులతో బాధపడ్తున్నట్టు తెలుస్తుంది.. నిరసనలో భాగమో లేదా అసంతృప్తి అసహనమే గాని అయన మాత్రం ఎక్కడా కూడా ప్రచారం లో పాల్గొనడం లేదని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version