స్కూళ్లకు సెలవులివ్వండి.. తెలంగాణ ప్రభుత్వానికి పేరెంట్స్ విజ్ఞప్తి!

-

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని పేరెంట్స్ నుంచి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండగా అధికారులు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లోని స్కూళ్లకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు.

దీంతో తెలంగాణలోని పాఠశాలలకు కూడా సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వరంగల్, మెదక్, వికారాబాద్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వ, ప్రైవేటుకు కూడా సెలవులు ఇవ్వాలని విద్యార్థుల పేరెంట్స్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version