గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఫలితాలు : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ 2024 ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారిగా తమ ప్రభుత్వం గ్రూపు 1 పోస్టులను భర్తీ చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేసిందని.. పేపర్ లీకేజీ కారణంగా రెండు సార్లు గ్రూపు పరీక్ష వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా కొన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు తెలిపారు.

మరో పది రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. 1:3 ప్రాతిపదికన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని.. దసరా లోపు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో 7వేల టీచర్ పోస్టులతో ఒకే నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు. తమ ప్రభుత్వం 65 రోజుల్లోనే 11,062 టీచర్ నియామకాలను చేపట్టిందని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version