యాదాద్రిని అద్భుతంగా కేసీఆర్ కట్టాడు – తెలంగాణ గవర్నర్‌

-

తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వ తీరును మెచ్చుకున్నారు తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ… ఇటీవల యాదాద్రి వెళ్ళాను… చాలా అద్భుతంగా నిర్మాణం చేశారని కేసీఆర్‌ ను మెచ్చుకున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించారు… కేసీఆర్ కు నా శుభాకాంక్షలు చెప్పండంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో అన్నారు తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్.

governer Radhakrishnan on KCR

ఇక అటు తెలంగాణ భవన్ నుండి బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల బృందం..తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ…గవర్నర్ సిపి రాధాకృష్ణను కలిసామని.. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని గవర్నర్కు వివరించామని తెలిపారు.

నిరుద్యోగ యువత, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు తుంగలో తొక్కారని ఆగ్రహించారు. నిరుద్యోగులపై దాడులు కేసులు దాడులు జరుగుతున్నాయని… ఒక భయానక వాతావరణాన్ని హైదరాబాదులో సృష్టించారని.. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version