హనుమకొండ ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

-

హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని ఎల్కతుర్తి మండలం పెంచికలపేట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రులకు పంపించారు. మృతి చెందిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘కుటుంబసభ్యులతో కలిసి వేములవాడ దర్శనానికి వెళ్తుండగా హనుమకొండ జిల్లా పెంచికలపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. నలుగురు చనిపోయారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులు, క్షతగాత్రులంతా ఏటూరునాగారం వాసులని తెలిసింది. మృతులు కాంతయ్య, శంకర్, భారత్, చందనగా గుర్తించాం. నిద్రమత్తులో జరిగిందా లేక అతివేగం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నాం. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నాం.’ అని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version