అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థిని మిస్సింగ్‌

-

అమెరికాలో భారతీయ విద్యార్థులు అదృశ్యమవ్వడం, హత్యకు గురవ్వడం వంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు విద్యార్థులు మూలాలున్న విద్యార్థులు వరుసగా సమస్యల్లో చిక్కుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ 23 ఏళ్ల తెలుగు విద్యార్థినిఅదృశ్యమైంది. గత వారం రోజులుగా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ప్రజల సాయం కోరారు.

హైదరాబాద్‌కు చెందిన నితీశ కందుల కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీ, శాన్‌ బెర్నార్డినోలో చదువుతోంది. మే 28వ తేదీ నుంచి నితీశ మిస్ అయింది. చివరిసారిగా ఆమె లాస్‌ ఏంజిల్స్‌లో కన్పించినట్లు యూనివర్సిటీ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఆ తర్వాత నుంచి నితీశ అదృశ్యమైనట్లు తెలిపింది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఆమె గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని స్థానికులను కోరారు. తమ కుమార్తె కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అమెరికాలో జరుగుతున్న ఘటనలు చూసి తమ కుమార్తె ప్రాణాలతో ఉందో లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version