ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ చేయనుంది. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభం చేసింది. ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులు జమ చేసింది ప్రభుత్వం. మొత్తం 18,180 మందికి 6 వేల చొప్పున జమ చేసింది. ఆ తర్వాత మండలి ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో నిలిచిపోయింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.
అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు మంత్రి సీతక్క. దీంతో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల అయ్యాయి. ఆ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించింది ప్రభుత్వం. 66,640 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్లు జమ చేసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించనుంది ప్రభుత్వం. ఒక సీజన్ కు 6000 రూపాయలు చొప్పున కూలీలకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం… డిబిటి పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను జమ చేస్తోంది.