గుజరాత్ బానిసలా ఉండడం కంటే చావడం మేలు – మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

బిజెపి పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నరేంద్ర మోడీని ఎదిరించే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరేనని అన్నారు. అందుకే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “బిడ్డా మీ ఆటలు ఇక్కడ సాగవు… ఇది కేసిఆర్ అడ్డా” అని ఫైర్ అయ్యారు.

18వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలని.. బీజేపీ ప్రలోభాల కుట్రను బట్టబయలు చేసి యావత్ తెలంగాణ సమాజంతో శబాష్ అనిపించుకున్నారని కొనియాడారు. బండి సంజయ్ కి సిగ్గు లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. గుజరాత్ బానిసలా ఉండడం కంటే చావడం మేలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version