రాష్ట్రంలో మళ్లీ జనశక్తి కదలికలు… పోలీసులు అలెర్ట్

-

రాష్ట్రం మళ్లీ నక్సల్స్ యాక్టివ్ కాబోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో మళ్లీ జనశక్తి యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా సిరిసిల్ల అటవీ ప్రాంతంలో 80 మందితో సమావేశం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనశక్తి సెక్రటరీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ సమావేశం అయ్యారు. సిరిసిల్ల, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటకు చెందిన మాజీ నక్సల్స్ తో సమావేశం అయ్యారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న జనశక్తి యాక్టివ్ కావడం.. ఇలా సమావేశం పెట్టడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సిరిసిల్ల జిల్లా పోతెనపల్లి ఫారెస్ట్ లో ఈ సమావేశం జరిగింది. అయితే ఈ మీటింగ్ పై పోలీసులు నజర్ పెట్టారు. సమావేశానికి హాజరైన మాజీల నుంచి సమాచారం తెలుసుకునే పనిలో ఉన్నారు. ఎవరెవరు ఈ సమావేశానికి హాజరయ్యారు.. ఎటువంటి నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు. మళ్లీ ఎందుకు జనశక్తి మూమెంట్ వైపు వెళ్తున్నారు.. ఇప్పుడు యాక్టివిటీస్ ఎందుకు జరుగుతున్నాయనే వివరాలపై పోలీసులు  ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version