మేము బీజేపీలో చేరడం లేదు…ఈటలనే మాతో రావాలని చెప్పాం- జూపల్లి

-

మేము బీజేపీలో చేరడం లేదు…ఈటలనే మాతో రావాలని చెప్పామంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు సంచలన ప్రకటన చేశారు. మేము బీజేపీలో చేరడం కాదు, ఈటెలను మాతో కలిసి రావాలని చెప్పామని తాజాగా ప్రకటించారు జూపల్లి కృష్ణా రావు.

ఈటెలతో చర్చించిన మాట వాస్తవమేనని పేర్కొన్న ఆయన…. మేము బీజేపీలో చేరడం కాదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఈటెలనే మాతో కలిసి రావాలని చెప్పాము. వచ్చే నెలలో మా నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు.

ఇది ఇలా ఉండగా, అటు పొంగులేటి శ్రీ నివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు బీజేపీలో చేరడం కష్టమేనని ఈటెల రాజేందర్ నిన్న అన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వారిని కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఆపగలిగాను. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. బీజేపీలో చేరమంటే వారే నాకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని వెల్లడించారు ఈటెల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version