BRS ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టులో కేసు వేస్తా..!

-

కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు లో కేసు వేస్తా అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి విదేశాల నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. నేను సీఎం రేవంత్ రెడ్డి కలిసి నెలకోసారి విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెద్దామని చెప్పాను. కానీ రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్లు నాతో మాట్లోడొద్దు అని చెబుతున్నారు. రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బెస్ట్ సీఎం లేకపోతే వరెస్ట్ సీఎం.

అక్టోబర్ 2న సమ్మిట్ పెట్టాలి లేకపోతే ఏదో ఓ బటన్ నొక్కి అందరి సంగతి తెలుస్తా అని అన్నారు. సదాశివపేటలో 1200 ఎకరాల్లో సొంతంగా చారిటీ పెట్టి 53 వేల మందికి ఉచితంగా అన్నం పెట్టాను. నా చారిటీని కొంతమంది రాజకీయ నాయకులు కుట్రతో రద్దు చేయించారు. ఇప్పుడు చారిటీలో 50 ఎకరాల భూములను గుంజుకోవడానికి నా మనుషులపై దాడులు చేసి బెదిరిస్తున్నారు. నా భూమిని కబ్జా చేస్తున్న వారిని పైకి పంపుతా.. దేవుని సేవను ఆపడానికి కుట్ర చేసినోడు ఎవ్వడు కూడా మిగలడు అని KA పాల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version