దుబ్బాకలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ వద్ద రచ్చ..!

-

దుబ్బాకలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి  మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. మంత్రి తో పాటు స్టేజి పైకి వెళ్లారు కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. దీంతో స్టేజీ పైకి ఓడిపోయిన వారు రావద్దని, ప్రోటోకాల్ పాటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు పట్టు బట్టారు.

దీంతో కచ్చితంగా స్టేజీ పైనే శ్రీనివాస్ రెడ్డి ఉంటాడని కాంగ్రెస్ నేతల ఆందోళన చేపట్టారు. మూడు పార్టీల కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు..తోపులాట జరిగింది. దీంతో కార్యకర్తలను నిలువరించేందుకు తంటాలు పడ్డారు పోలీసులు. స్టేజి నుంచి కిందికి దిగాడు చెరకు శ్రీనివాస్ రెడ్డి. ఇక రసాభాస మధ్య కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి కొండా సురేఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version