సీఎం కేసీఆర్‌ కు మరో షాక్‌.. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఊహించని షాక్ తగిలింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు కసిరెడ్డి. ఈ మేరకు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కసిరెడ్డి.

Kasireddy joined the Congress party

కసిరెడ్డి ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిత్యం వహిస్తున్నారు. అయితే కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వలేదని… తన స్థానంలో జైపాల్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ప్రస్తావించడంతో… అసంతృప్తిలోకి వెళ్లారు ఎమ్మెల్సీ కసిరెడ్డి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ ఆఫర్ రావడంతో.. తాజాగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కసిరెడ్డి. మరి కాంగ్రెస్ పార్టీలోనే నైనా… కసిరెడ్డికి కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ వస్తుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version