హరే కృష్ణ హెరిటేజ్‌ టవర్‌కు కేసీఆర్ శంకుస్థాపన

-

హైదరాబాద్ లోని కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీకృష్ణ గో సేవా మండలి విరాళంతో నిర్మించిన హరే కృష్ణ హెరిటేజ్ టవర్ కు సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్ కి వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇంతటి ఆధ్యాత్మిక వాతావరణంలో మీ మధ్యన ఉన్నందున సంతోషంగా ఉందన్నారు.

హరే కృష్ణ ఫౌండేషన్ అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేయడం గొప్ప విషయం అని.. హైదరాబాద్ లో ధనవంతులు కూడా 5 రూపాయల భోజనం తింటున్నారని చెప్పారు. కరోనా సమయంలో హరే కృష్ణ ఫౌండేషన్ సేవలను ఆయన కొనియాడారు. ఆలయ నిర్మాణానికి 25 కోట్లు ఇస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇక యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామని.. వేములవాడ, కొండగట్టు ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version