భారీగా పెరిగిన ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం…!

-

ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం 70 లక్షలను తాకింది. హోర్డింగులు ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో 40 లక్షలు సమకూరినట్టు సమాచారం. అయితే ఆన్లైన్ ద్వారా, గణపతి చెంతన ఏర్పాటు చేసిన స్కానర్ల ద్వారా వచ్చిన విరాళాలను లెక్కించాల్సి ఉంది. ఇక ఖైరతాబాద్ లో గణపతి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి మొట్టమొదటిసారి హుండీ లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగింది.

ఇదిలా ఉంటె ఖైరతాబాద్ వినాయకుడు వద్ద భక్తుల హడావుడి తగ్గడం లేదు. దర్శనాలు నిన్న రాత్రి తో ముగిసాయని ముందుగా సమాచారం అందించినప్పటికి మళ్ళీ బారులు తీరారు భక్తులు. దీంతో వెల్డింగ్, కర్ర తొలగింపు పనులకు ఆటంకం కలుగుతుంది. పోలీసులు, ఉత్సవ కమిటీ ఎంత వారించినా బడా గణేష్ వద్దకు వస్తున్నారు భక్తులు. కర్రలను తొలగిస్తున్న పనులు సాగుతున్న నేపథ్యంలో పై నుంచి కర్రల పడే ప్రమాదం ఉందని అంటున్నారు నిర్వహకులు. భక్తులను రోప్ సహాయంతో ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద నుంచి పంపించేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version