BREAKING : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం

-

తెలంగాణ బిజెపి కీలక నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేనల్లుడు అయిన జీవన్ రెడ్డి నిన్న గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలారు.

ఈ తరుణంలోనే ఆయన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జీవన్ రెడ్డి మృతి చెందారని డాక్టర్లు తెలిపారు. నోయిడా లో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఈ వార్త తెలియగానే.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. కాగా, జీవన్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version