ఈ పిల్లాడిని మిస్ అవుతున్నా: కేటీఆర్

-

మంత్రి కేటీఆర్ చాలా ఎమోషనల్‌ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న మంత్రి కేటీఆర్ తన కుమారుడు హిమాన్షును గుర్తుచేసుకున్నారు. తన కొడుకుతో దిగిన ఫోటోను పంచుకుంటూ ‘ఈ పిల్లాడిని మిస్ అవుతున్న’ అని ట్విట్ చేశారు. హిమాన్షు అమెరికా వెళుతున్న సమయంలోను తాను ఒంటరిగా వెళ్లడం లేదని తనలోని కొంత భాగాన్ని కూడా తీసుకెళ్తున్నాడు అంటూ కేటీఆర్ ఎమోషనల్ ట్విట్ చేసిన విషయం తెలిసిందే.

ktr missed himanshu

కాగా, BJP స్టీరింగ్‌ అదానీ చేతిలో ఉందని అమిత్‌ షాకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. అబద్దాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాటం తప్పదని హెచ్చరించారు కెటిఅర్. అమిత్ షా ప్రసంగం ఆసాంతం అబద్ధాలేనని.. అమిత్ షా మోడీ ఎన్ని అబద్ధాలు ఆడిన తెలంగాణలో బిజెపికి ప్రజల చేతుల్లో తిరస్కారం తప్పదని ఫైర్‌ అయ్యారు. మళ్లీ ఎన్నికల్లోను 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అవడం ఖాయమని.. పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version