6 గ్యారంటీలు అర్హులైన ప్రజలకు అందేలా కార్యకర్తలు చూడాలి – మహేష్ గౌడ్

-

ఆరు గ్యారంటీ లు అర్హులైన ప్రజలకు అందేలా కార్యకర్తలు చూడాలి, అందుకు కార్యకర్తలు కంకనబద్దులం అయ్యి పని చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్. 139 ఏళ్ల క్రితం 72 మందితో ముంబై లో ఏర్పాటైన పార్టీ కాంగ్రెస్… బ్రిటిష్ పాలకులకు గడగడలాడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు. ప్రపంచ చరిత్రలో 139 ఏళ్ల చరిత్ర ఏ పార్టీకి లేదు… కాంగ్రెస్ పార్టీకి ఉన్న మూల సిద్ధాంతాలే కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నాయని చెప్పారు.

mahesh goud

స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో తీవ్ర పేదరికం,దారిద్య్రం ఉండే..నాటి పాలకుల త్యాగాల వల్లే దేశం ప్రస్తుతం ఎలా ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని.. తొమ్మిది ఏళ్ల తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని వెల్లడించారు. కాంగ్రెస్ త్యాగాలు యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది… గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు తెలుసుకోవాలన్నారు. దేశాన్ని కులాలకు, మతాలకు అతీతంగా ఉండాలని, దేశాన్ని ఒక్కటి చేయాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏకం చేసిందని పేర్కొన్నారు. మరో సారి రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేయబోతున్నారు… అందరం రాహుల్ గాంధీ కి బాసటగా ఉండాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version