లిక్కర్ స్కామ్​తో కేసీఆర్ అవినీతి దిల్లీకి పాకింది : ఖర్గే

-

ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి తెలంగాణ నుంచి దిల్లీకి పాకిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. లిక్కర్ స్కామ్​లో ఆప్‌ సర్కారుతో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కుమార్తె కోసం కేసీఆర్ మోదీతో చేతులు కలిపారని అన్నారు. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలో కాంగ్రెస్‌ సభకు హాజరైన ఖర్గే ప్రసంగించారు. కేసీఆర్‌, మోదీ.. పేదలను మరింత పేదలుగా చేస్తున్నారని.. ధనవంతులకే కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. మోదీ, కేసీఆర్‌.. ఇద్దరూ అబద్ధాలే చెబుతున్నారని.. వారిద్దరూ ఒక్కటేనని అన్నారు.

“పేదల ఖాతాల్లో మోదీ రూ.15 లక్షలు వేస్తామన్నారు.. వేశారా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా? రైతుఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు.. చేశారా? హైదరాబాద్‌లో నెహ్రూ కాలంలోనే అనేక పరిశ్రమలు వచ్చాయి. కాంగ్రెస్‌ పెట్టిన పరిశ్రమలను మోదీ సర్కారు అమ్ముకుంటోంది. ప్రభుత్వ రంగంలో కాంగ్రెస్‌ గతంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చింది. బీఆర్ఎస్ సర్కారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచింది. సనత్‌నగర్‌లో కాంగ్రెస్‌ మహిళా అభ్యర్థికి మద్దతు ఇవ్వండి.” అని మల్లికార్జున ఖర్గే ఓటర్లను కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version