కేసీఆర్‌ కు భయపడి.. పొంగులేటి బీజేపీలోకి వెళుతున్నాడు – పొంగులేటి అనుచరుడు

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు భయపడి.. పొంగులేటి బీజేపీలోకి వెళుతున్నాడని పొంగులేటి అనుచరుడు మట్ట దయానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మట్ట దయానంద్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మట్ట దయానంద్ మాట్లాడుతూ.. టెన్షన్‌లో కేసీఆర్ మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశాడు కానీ ఇప్పుడు భయపడుతున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్దాం అనుకున్నారని… బీజేపీ అయితే ఖమ్మం 10 కాదు ఒక్క సీట్ కూడా గెలవలేము అని చెప్పానని వివరించారు మట్ట దయానంద్. పదేళ్లకు పైగా పొంగులేటి అనుచరుడిగా ఉన్నాను. అయినా నా మాటలు ఆయనకి నచ్చలేదు ఏమో నన్ను దూరం పెట్టారన్నారు మట్ట దయానంద్. బీజేపీ అయితే గెలవలేను అని కాంగ్రెస్ పార్టీలో చేరాననని వెల్లడించారు మట్ట దయానంద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version