తెలంగాణలో నేడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్

-

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 11,062 పోస్టులతో ఇవాళ కొత్త నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నివాసంలో విడుదల చేయనున్నారు.

ఈ పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 ఉన్నాయి. దరఖాస్తుల గడువు, నియమ నిబంధనలను సీఎం రేవంత్ ఈరోజు వెల్లడించనున్నారు. మే లేదా జూన్‌ నెలలో 10 రోజులపాటు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కొత్త నోటిఫికేషన్‌కు నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటన రద్దుకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేస్తామని అందులో పేర్కొంది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version