మోడీ, షా లకు మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్.. అలా చేస్తే మునుగోడు ఉపఎన్నిక బరినుండి తప్పుకుంటాం !

-

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
ప్రదానిమోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఛాలెంజ్ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆ18,000 వేల కోట్లు మునుగోడు, నల్లగొండ అభివృద్ధి కి ఇవ్వాలని.. అలా చేస్తే ఉప ఎన్నికల బరి నుండి తప్పుకుంటామని సవాల్ విసిరారు. బిజెపి నా చాలెంజ్ ని స్వీకరిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రాధేయపడైన ఒప్పిస్తానన్నారు.

“కమ్యూనిస్టు సోదరుల సాక్ష్యంగా చెబుతున్నా.. ఆయన సొంతానికి ఇచ్చే సొమ్ము జిల్లా అభివృద్ధికి ఇవ్వండి” అన్నారు. రాజకీయాల కొరకే ఉప ఎన్నికలు సృష్టించారని మండిపడ్డారు. తెలంగాణా అభివృద్ధి ని అడ్డుకోవడానికి ఈ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. సస్యశ్యామలం అవుతున్న తెలంగాణా లో మంటలు సృష్టించే కుయుక్తులు చేస్తున్నారని అన్నారు. హిందు మతం గురించి వేదాలు వల్లించే బిజెపి ప్రభుత్వం యాదాద్రి పునర్ నిర్మాణానికి 100 రూపాయల చందా విదల్చలేదన్నారు.

హిందు మతానికి అంబాసిడర్లు అంటూ ఇతర మతాల మీద విషం చిమ్మే బిజెపి యాదాద్రి పునర్ నిర్మాణానికి నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గల్లీ, గల్లీ లో కేంద్రమంత్రులు తిరుగుతున్నారని.. ఎవరూ… ఏ ఒక్కరోజు తెలంగాణా అభివృద్ధి కి పైసా విదల్చలేదన్నారు. వడ్డీకి అప్పులు తెచ్చి భవిష్యత్ తరాలకు విద్యుత్ సరఫరా లో ఇబ్బంది ఉండొద్దన్న సంకల్పంతో నిర్మిస్తున్నామన్నారు. రాజగోపాల్ రెడ్డికి రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ కుట్రలకు తెర లేపేందుకు మాత్రం రాజగోపాల్ రెడ్డికి 18000 కోట్లు ఇచ్చారని ఆరోపించారు జగదీశ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version