హరీశ్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు : జూపల్లి

-

హరీశ్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతుబంధు ఎప్పుడు చెల్లిస్తారన్న ఎమ్మెల్యే హరీష్ రావు వాక్యాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. ‘హరీష్ రావు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.

పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. రెండు రోజుల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏమనాలి? అయినా రెండు రోజుల్లోనే పథకాల అమలుకు శ్రీకారం చుట్టాం. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది’ అని మంత్రి ఆరోపించారు.

కాగా, డిసెంబర్ 9న రైతు బంధు ఇస్తామని మాట తప్పారు..ఎప్పుడు వేస్తారు అని అసెంబ్లీ ఆవరణలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. నిన్న అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు హరీశ్ రావు. ప్రతిపక్షం లో ఉన్నాం కాబట్టి విమర్శ చేయాలని కాదు. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుంది. రైతులకు బోనస్ ఇస్తాం అని ఎన్నికల సమయంలో చెప్పారు. బోనస్ కింది 5 వందల రూపాయలు ఇస్తాం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version