వీధి కుక్కల బారినపడి చిన్నారి మృతి చెందడం పై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందన

-

హైదరాబాద్ లో ఓ చిన్నారి వీధి కుక్కల బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. రోడ్డుపై వెళ్తున్న ఐదేళ్ల బాలుడిని వీధి కుక్కలు దారుణంగా కరిచి చంపేయడం అందరిని కలచివేసింది. ఈ విషాదకర ఉదాంతంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

వీధి కుక్కలకు పట్టుకొని అడవిలో వదిలి పెట్టాలన్నారు. కేటీఆర్ గారు మీకు పిల్లలు లేరా?.. ఆ బాలుడు చనిపోవడం బాధ కలగడం లేదా? అని ప్రశ్నించారు. జిహెచ్ఎంసి అధికారులు ఏదైనా సంఘటన జరిగితే హడావిడి చేసి ఆ తర్వాత మర్చిపోతారని.. కుక్కల్ని పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంపేయాలని అంటే కొన్ని సంఘాలకు ఆగ్రహం వస్తుందని.. అందుకే వాటికి పట్టుకుని అడవిలో వదిలి వేయమని కోరుతున్నానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version