బీజేపీ, బీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీరియస్ కామెంట్స్..!

-

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈఎన్సీ మురళీధర్ రావును తొలగిస్తేనే నిజాలు బయటకి వస్తాయన్నారు. ఆయన గత ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారని.. తక్షణమే బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. న్యాయ విచారణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఏకమవుతున్నాయని విమర్శించారు.

బీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అడ్డుకుంటున్న విధానానికి బీజేపీకి కూడా సపోర్టు చేస్తుందన్నారు. జ్యూడిషియల్ ఎంక్వైరీ చాలా పారదర్శకమైనదని అభిప్రాయపడ్డారు. నిస్పక్షపాతంగా విచారణ చేపట్టబోతున్నామని చెప్పారు. తెలంగాణలో నెంబర్ వన్ 420 కేసీఆర్ అని.. మోసగాడు కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు జీవన్ రెడ్డి. నెల రోజుల్లోనే హామీలను అమలు చేయలేదంటూ.. కాంగ్రెస్ ను 420ని కేటీఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ తొలుత దళితులను మోసం చేశారని మండిపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమి అని మోసం.. మీరు ఇచ్చిన హామీలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి కేటీఆర్ అంటూ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version