BRS కి షాక్.. ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్ రెడ్డి రాజీనామా

-

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలిందనే చెప్పాలి. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. నిన్నటికి నిన్న బీజేపీకి షాక్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా.. ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 31వ తేదీన కొల్లాపూర్‌లో జరగనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరనున్నట్టు ప్రకటన చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్‌లో తనకు అన్ని విధాలుగా సహకరించారని.. కానీ స్థానిక సమస్యలను మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version