తెలంగాణ ప్రజలు భారతీయులు కాదా? : పల్లా రాజేశ్వర్ రెడ్డి

-

తెలంగాణ ప్రజలు భారతీయులు కాదా? అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పంజాబ్ లో ఏవిధంగానైతే వడ్లు కొంటున్నారొ అదే విధంగా తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర బీజేపీ నాయకులు ఒకటి మాట్లాడితే రాష్ట బీజేపీ నాయకులు మరోటి మాట్లాతున్నరని అన్నారు. యాసంగి లో కేంద్రం వడ్లు కొనదు అంటే, కెసిఆర్ వరి వెయ్యొద్దు అని చెప్పారని గుర్తు చేశారు.

 

15 లక్షల మంది వరికి బదులు వేరే పంటలు వేసుకున్నారు.35 లక్షల మంది రైతులు వరి పంట వేశారు.తెలంగాణ కోసం ఎలా పోరాటాలు చేసామో.. తెలంగాణలోని వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రం పై పోరుకు సిద్ధం కావాలి పిలుపునిచ్చారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.ఈ నెల 7న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలన్నారు. 8 తేదీన గ్రామాల్లో ప్రతి రైతు ఇంటిపై నల్లజెండాలు ఎగురవేయలన్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.యాసంగి పంట ను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version