నైతికంగా కాంగ్రెస్ పార్టీదే విజయం : వంశీచంద్ రెడ్డి

-

బీజేపీ, బీఆర్ఎస్ ల అక్రమ బంధం తోనే బీజేపీ గెలిచిందని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది బీజేపీ స్వతహాగా గెలిచిన గెలుపు కాదని అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.12 లక్షల 18 వేల పైచిలుకు ఓట్లలో 4500 మెజారిటీ ఒక మోజరిటీనా అని, నైతికంగా కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆయన ఎద్దేవా చేశారు.

కౌంటింగ్ లోని ప్రతి రౌండ్ లో అతి స్వల్ప తేడాతో లీడింగ్ వచ్చిందని,చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన లెక్కింపులో స్వల్ప మెజారిటీతో తన ఓటమి, ఒక ఓటమే కాదని ఆయన గద్గద స్వరంతో అన్నారు. ఎన్నికల సమయంలో తన మ్యానిఫెస్టోలోని హామీలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నెరవేర్చడానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పట్ల నిరంతరం స్పందిస్తూనే ఉంటానని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version