BREAKING : ఒంటేరు ప్రతాప్ రెడ్డి వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

-

బీఆర్ఎస్ నేత, రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. కొంపల్లి లోని తన ఇంటి నుంచి తుప్రాన్ వెళుతుండగా మేడ్చల్ జిల్లా అథ్వెల్లి 44వ జాతీయ రహదారి వద్ద ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాద సమయంలో ప్రతాప్ రెడ్డి వాహనంలో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, బీఆర్ఎస్ నేత, రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి..2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ పై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version