తెలంగాణలో రెండు కొత్త మండలాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటు కానున్నాయి. రంగారెడ్డి జిల్లాతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటుకు సర్కారు తుది నోటిఫికేషన్ జారీ చేసింది.

రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఇర్విన్ ను మండలంగా రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. ఏవైనా అభ్యంతరాలు, వినతులు ఉంటే సమర్పించాలని ప్రజలకు సూచించింది. వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకున్న రెవెన్యూ శాఖ… మాడ్గుల్ మండలం నుంచి తొమ్మిది గ్రామాలతో ఇర్విన్ మండలాన్ని ప్రతిపాదించింది. కాగా… రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 27 మండలాలు ఉండగా… ఇర్విన్ మండల ఏర్పాటుతో వాటి సంఖ్య 28 కి చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version