నేడు రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. ఎన్నికల ప్రచారానికి మరో రెండ్రోజులే గడువు ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలు జాతీయ నేతలను రంగంలోకి దింపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయిస్తున్నాయి. ఇందులో భాగంగా గత వారం రోజుల నుంచి బీజేపీ జాతీయ నేతలంతా రాష్ట్రంలో తిష్టవేశారు. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారాన్ని ముమ్మరం చేయగా.. మూడుసార్లు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

గత రెండ్రోజులుగా సభలు, సమావేశాలతో బిజీబిజీగా గడిపిన ప్రధాని మోదీ.. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం మళ్లీ రాష్ట్రానికి బయల్దేరనున్నారు. మోదీ మూడ్రోజుల రాష్ట్ర పర్యటన ఇవాళ జరిగే రోడ్ షోతో ముగియనుంది. తిరుమల నుంచి మోదీ.. తొలుత హెలికాప్టర్‌లో మహబూబాబాద్‌కు వెళ్లి.. అక్కడ ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్‌ ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్న ప్రధాని మోదీ.. ఆర్టీసీ క్రాస్​ రోడ్స్ నుంచి కాచిగూడలోని వీర సావర్కర్ విగ్రహం వరకు రోడ్ షో చేయనున్నారు. సాయంత్రం 5నుంచి 6 గంటల వరకు 2 కిలోమీటర్ల పొడవునా ప్రధాని మోదీ రోడ్ షో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version