ప్రజా ప్రతినిధులు అధికార మదంతో విర్రవీగే టైం అయిపోయింది – పొంగులేటి

-

ఖమ్మం జిల్లా: మళ్లీ ప్రజాప్రతినిధిగా గెలుస్తా.. రామరాజ్యం ఇస్తానన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పార్లమెంట్ టిక్కెట్ దగ్గర నుంచి అనేక అవమానాలు జరిగాయన్నారు. మాటలు చెప్పడం వరకే ముఖ్యమంత్రి కేసీఆర్ పని అని.. మాటలు చెపితే మూడో సారి కూడా ఓట్లేస్తారనే కెసిఆర్ అనుకుంటున్నాడని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్న వారిని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, బిఆర్ఎస్ పార్టీ పట్టించుకొనప్పుడు.. మీకు అండగా ఉన్నా.. ఆదుకున్నానన్నారు. అధికార మదంతో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు విర్రవీగే టైమ్ అయిపోయిందన్నారు. నాలుగు సంవత్సరాల్లో మిమ్మల్ని ఎంత హీనంగా చూశారో గుర్తు ఉంచుకోండని ప్రజలకు సూచించారు. నేను మాటల మనిషిని కాదన్నారు పొంగులేటి. మీరందరూ ఒకే గూటికి రావాలని.. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version