త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.. పూనం కౌర్ సంచలన ట్వీట్..!

-

ప్రస్తుతం టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం దుమారం రేపిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడు అంటూ లేడీ కొరియోగ్రాఫర్ ఆయన పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఈ విషయం పై చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో నటి పూనం కౌర్ సంచలన ట్వీట్ చేసారు. దర్శకుడు త్రివిక్రమ్‌ని సినీ పరిశ్రమ పెద్దలు ప్రశ్నించాలని కోరుకుంటున్నట్లు పూనం కౌర్ పేర్కొంది.

అయితే పూనం కౌర్, త్రివిక్రమ్‌ వ్యవహారం అందరికి తెలిసిందే. ఆమె ఎప్పుడు గురూజీపై విమర్శలు చేస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం వైరల్ గా మారడంతో మరోసారి త్రివిక్రమ్‌ పై ఆరోపణలు చేసింది పూనం కౌర్. నేను గతంలోనే తెలుగు ఫీలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసినప్పుడు నాకు ఎవ్వరు సహకరించలేదు. అంతే కాకుండా రాజకీయంగా కూడా నన్ను ఇబ్బందులకు గురి చేసారు అని పూనం కౌర్ తన ట్విటర్ లో రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version