హైకోర్టులో ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి పిటిషన్

-

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషాబాయి హైకోర్టులో పిటిషన్ వేశారు. తన భర్త రాజాసింగ్‌ను ప్రత్యేక తరగతి ఖైదీగా గుర్తించి వసతులు కల్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. పదే పదే మతపరమైన వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారన్న కారణంగా రాజాసింగ్‌ను పీడీ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న విషయం విదితమే. దీనిని సవాలు చేస్తూ ఇప్పటికే రాజాసింగ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, ఆయనను ప్రత్యేక తరగతి ఖైదీగా గుర్తించి వసతులు కల్పించాలని భార్య తాజాగా పిటిషన్‌ వేశారు.

ప్రత్యేక గది, మంచం, టేబుల్‌, కుర్చీ, వార్తాపత్రికలు, టీవీ, వంట చేసుకోవడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని హైకోర్టును రాజాసింగ్ సతీమణి ఉషాబాయి కోరారు. జైలులో ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచిఉందని.. ఇతర ఖైదీలకు దూరంగా ఉంచాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కన్నెగంటి లలిత విచారణ చేపట్టగా వాదనలు వినిపించడానికి గడువు కావాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరడంతో విచారణను 28కి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version