నాపై టెర్రరిస్టులు ఎటాక్‌ చేస్తారు… ఇంటలిజెన్స్ పోలీసులకు రాజాసింగ్‌ లేఖ

-

BREAKING : ఇంటలిజెన్స్ పోలీసులకు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ రాశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఎందుకు మార్చడం లేదని ఇంటలిజెన్స్ IG కి రాసిన ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. కొత్త వెహికిల్ ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అనుమతి అడుగుతున్నారు ? అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా ? అని ప్రశ్నించారు రాజాసింగ్.

టెర్రరిస్టులు, యాంటీ సోషల్ యాక్టీవిస్ట్ లు తనపై దాడి చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారని రాజాసింగ్ ఆరోపణలు చేశారు. తన లైఫ్ డేంజర్ లో ఉందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉందని…కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ కేటాయించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version