రామచంద్ర భారతి టార్గెట్ గా సిట్ విచారణ వేగవంతం

-

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు పెంచింది. రామచంద్ర భారతి టార్గెట్ గా సీట్ విచారణ వేగవంతం చేసింది. రామచంద్ర భారతి తో సంబంధం ఉన్న అందరి డిటియల్స్ ని సిట్ అధికారులు సేకరిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో రామచంద్ర భారతీయ ఎక్కడెక్కడికి వెళ్లారు.. ఎవరెవరిని కలిశారు అన్నదానిపై సిట్ విచారణ కొనసాగుతోంది.

రామచంద్ర భారతి ఫోన్ లో వేల ఫొటోస్ ని రికవరీ చేశారు సిట్ అధికారులు. రామచంద్ర భారతికి, బిజెపికి సంబంధించిన అనేకమంది నేతలతో ఉన్న ఫొటోస్ ని రికవరీ చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో ప్రభుత్వం పడిపోయిన సమయంలో కొంతమంది కేంద్ర మంత్రులను రామచంద్ర భారతి కలిసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం నిందితుడు నందకుమార్ కేంద్రంగా దర్యాప్తు చేసిన అధికారులు.. ఇప్పుడు రామచంద్ర భారతి టార్గెట్ గా విచారణ వేగవంతం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version