రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు త్వరలోనే జవాబు చెప్తా – ఈటల

-

మునుగోడు ఉపఎన్నిక సమయంలో BRS నుంచి రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు తీసుకున్నట్లు ఈటల రాజేందర్ చేసిన వాక్యాలపై యూత్ కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈటల వెంటనే తన ఆరోపణలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చేయాలని, ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఈటల దిష్టిబొమ్మ దహనానికి పిలుపునిచ్చింది.

ఇది ఇలా ఉండగా, రేవంత్‌ రెడ్డి ప్రమాణపై ఈటల స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు తాను త్వరలోనే జవాబు చెప్తానని తెలిపారు. భారతీయ పరిరక్షణ పేరుతో నేరెడ్మెట్ సరస్వతి ఫంక్షన్ హాల్ లో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ నాణానికి చెరోదిక్కుగా బొమ్మ, బోరుసుగా అభివర్ణించారు.

అవి ఎన్నికలకు ముందు కలుస్తాయా లేక తర్వాత కలుస్తాయో తెలియదు. కానీ రెండు పార్టీలు ఒకటేనని తెలిపారు. ఈరోజు అక్రమ సంపాదనతో రాజకీయాలను సాచిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈరోజు అమ్మా అమ్మా అంటూ మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. 20 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో పడ్డటిగానే నడుచుకుంన్నానని ఎవరిని వ్యక్తిగతంగా విమర్చించలేదని తెలిపారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version