సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కు కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి డ్రగ్స్‌ వ్యవహారం తారా స్థాయికి వెళ్లిన నేపథ్యంలోనే.. సీఎం కేసీఆర్‌ కు రేవంత్‌ రెడ్డి ఈ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ ఆందోళన కలిగిస్తుందని..ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో సిట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు రేవంత్‌ రెడ్డి.

సీఎంగా మీరే ఆ సంస్థకు స్వయంగా లేఖ రాయాలి, సిట్‌ ఏర్పాటుపై ప్రధానికి లేఖ రాయండని రేవంత్‌రెడ్డి సూచనలు చేశారు. డ్రగ్స్ కు సంబంధించిన డిజిటల్ కార్డులను తక్షణమే ఈడికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రక్తసరఫరా ఆందోళన తగ్గిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ కు బానిస అయి యువకుడు మృతి చెందిన ఘటన తర్వాత అయినా.. సీఎం కెసిఆర్ లో మార్పు రావాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version