BREAKING : అధికారికంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు

-

BREAKING : అధికారికంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు జరుపుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రకటన చేశారు. డిసెంబర్ 9 సోనియాగాంధీ జన్మదినం అని.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని వెల్లడించారు.

ధరణికి.. రైతు బంధుకు సంబంధం ఏంటి..? రైతు బంధు.. ధరణి కంటే ముందే ఇస్తున్నారు.. అప్పుడు ఎలా ఇచ్చారు..? అని నిలదీశారు. ధరణి రద్దు అయితే.. రైతు బంధు రాదు అని కేసీఆర్‌, కేటీఆర్‌ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని నిప్పులు చెరిగారు రేవంత్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కుటుంబంపై రేవంత్‌ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తండ్రి, కొడుకు లకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని.. చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని…కొడుకు..బిడ్డ ..కోడలు..అల్లుడు అందరూ..అందులో ఉండొచ్చంటూ ఫైర్‌ అయ్యారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version