సోలరైజ్డ్ గ్రామంగా రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డి పల్లి..!

-

రాష్ట్రంలో పూర్తి స్థాయి సోలరైజ్డ్ గ్రామంగా సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డి పల్లి చేరనుంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  ఆదేశాలనుసారం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా చేయుటకు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో  ఇవాళ మంగళవారం, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్  ముషారఫ్ ఫరూఖి ఐఏఎస్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, బి సంతోష్ ఐఏఎస్, రెడ్కో VC & MD,  అనిల, సంస్థ డైరెక్టర్ కమెర్షియల్, శ్రీ కే రాములు, ఇతర శాఖల ముఖ్య అధికారులతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటిస్తూ పలువురు గ్రామస్తులతో, రైతులతో, మరియు ప్రజాప్రతినిధులతో మాట్లాడారు.

ఈ పైలట్ ప్రాజెక్ట్ వివరాలను తెలియజేశారు. గ్రామంలో దాదాపు 499 గృహ వినియోగదారులు, 66 వాణిజ్య వినియోగదారులు, 867 వ్యవసాయ వినియోగదారులు, ఇతర కేటగిరీల తో కలుపుకుని మొత్తం 1451 వినియోగదారులు ఉన్నారు. ఈ మోడల్ ప్రాజెక్ట్ అమలు చేయడం కోసం ఇవాల్టి నుంచి గ్రామంలో ఇంటింటి సర్వే మొదలుపెట్టారు.  ఈ సర్వే ద్వారా గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి DPR మరియు తదుపరి ప్రక్రియ జరగనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version