మహేందర్ రెడ్డి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న రోహిత్ రెడ్డి

-

మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కలిసిపోయారు. బద్ధ శత్రువులైన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిన్న దోస్తులయ్యారు.

నిన్నటి వరకు శత్రువుల్లా కొట్టుకున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.. కేసీఆర్ చొరవతో కలిసిపోయారు. మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనని కలిసి, కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు పైలెట్ రోహిత్ రెడ్డి. కాగా పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల్లోనే మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకోనున్నారు.

కాగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజక వర్గాల వారీగా బిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన నేపథ్యంలో., ప్రగతి భవన్ లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజా ప్రతినిధులు సిఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. వారిలో….మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తదితరులున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version