200 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!

-

దాదాపు 200 కిలోల గంజాయి పట్టివేయడంతో పాటు.. ఇద్దరూ వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నవరం  పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాకర్ పై అక్రమంగా రవాణా చేస్తున్న రెండు వందల కిలోల గంజాయి తో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. చింతపల్లి సీఐ రమేష్ అందించిన వివరాలిలా ఉన్నాయి. ముందస్తు సమాచారంతో మండలంలోని చెరుకుంపాకలు జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఇదే సమయంలో లోతుగడ్డ నుంచి చెరుకుంపాలెం వైపుగా వస్తున్న ఇద్దరు వ్యక్తులతో ట్రాక్టర్ వస్తుంది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసిన ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ ను రోడ్డు పక్కన నిలిపివేసి, పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటబడి పట్టుకున్నారు. అదే సమయంలో ట్రాక్టరును తనిఖీ చేయగా రెండు వందల కిలోల గంజాయిని గుర్తించారు. దీనికి సంబంధించి జి.మాడుగుల మండలానికి చెందిన పాంగి శ్రీను, కొర్ర సత్తిబాబు అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసి ట్రాక్టర్ ను సీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version