AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలి : అక్బరుద్దీన్ ఒవైసీ

-

AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. నాంపల్లిలో డబుల్ ఓటర్ కార్డులున్నాయి. ఓటర్ కార్డులో ఒక అడ్రస్ ఉంటే.. ఆధార్ కార్డులో మరో అడ్రస్ ఉందని తెలిపారు అక్బరుద్దీన్ ఒవైసీ. 2011 తెలంగాణ సర్వే ప్రకారం.. జనాభా లెక్కల ప్రకారం.. 51లక్షల మంది మైనార్టీలు ఉన్నారని.. ఆధార్ ప్రకారం.. మన తెలంగాణ జనాభా 3.80 కోట్లు అని తెలిపారు. నేను ఒక ముస్లింకే కాదు.. అన్ని వర్గాలకు ప్రతినిధిని అని తెలిపారు అక్బరుద్దీన్.

అన్ని వర్గాలు ఓటు వేస్తేనే గెలిచాను. ఆలస్యం చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కేబినెట్ ఆమోదం తెలిపిన  తరువాత కులగణన నివేదికను ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పై బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పై ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version